2 July, 2026 | 12:31 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కృషి

04-11-2025 10:47 PM

మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని, నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని గుర్తించే దిశగా, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పలు ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని రవి సూచించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఇంటికీ విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ప్రతిపాదనను తెచ్చామని, అలాగే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న విద్యుత్ అధికారులకు ఏఈ సత్యనారాయణ రెడ్డికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్‌మెన్ భాస్కర్, కాంట్రాక్టర్లు, రాంగోపాల్ రావ్, శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.