ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
సికింద్రాబాద్ డీసీసీ సెక్రటరీగా కొమ్ము మోహన్ బాబు
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 12 (విజయ క్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు కొమ్ము మోహన్ బాబు డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) సెక్రటరీగా నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, యువతలో ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ పదవి అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొమ్ము మోహన్ బాబు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన నియామకంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయ కులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొమ్ము మోహన్ బాబు మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుం టానని తెలిపారు.
పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు, పార్టీ అధిష్ఠానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరో హించాలని ఆకాంక్షించారు.




