21 March, 2026 | 1:53 PM

Breaking News

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోటలక్ష్మికాంతారావు   •   బీసీలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం   •   ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం   •   జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •  

రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

21-03-2026 12:13 AM

మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్

పెబ్బేరు మార్చి 20: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం సోదరులు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ‘రంజాన్ తోఫా’ కిట్లను శుక్రవారం 9వ వార్డు లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని మతాల పండుగలను గౌరవించడం, పేదలకు అండగా నిలవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు క్రమశిక్షణతో విజయవంతంగా కొనసాగాలని, పట్టణ ప్రజలందరికీ అల్లాహ్ ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.అనంతరం లబ్ధిదారులు ప్రభుత్వం మరియు మున్సిపల్ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ గౌడ్, బాలరాజు, బండమీది నరసింహ, అసాద్, కురుమూర్తి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.