24 August, 2026 | 11:30 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్

21-04-2026 05:37 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ  రాజకీయాలకతీతంగా పారదర్శకంగా  బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములపల్లి, మాడుగులపల్లి మండలాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు 60 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు తో పాటు ఉచిత సన్న బియ్యంపంపిణీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలను అందిస్తూ ఆడపిల్లల పెళ్లిలకు తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వివిధ సంక్షేమ పథకాలలో లబ్ధి పొందిన లబ్ధిదారులే ప్రచార కార్యకర్తలుగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులున్నారు.