24 August, 2026 | 11:42 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ పంపిణీ

24-08-2026 09:18 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో కుట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ లను దిర్శించర్ల, చిల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఉచిత యూనిఫామ్ లు పొందిన విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారని, మహిళా సమైక్య ఆధ్వర్యంలో కుట్టడం వల్ల మహిళలకి ఉపాధితో పాటు ఆర్ధిక సౌలభ్యత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దిగించర్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, చిల్లేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా నాయక్, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.