6 July, 2026 | 2:20 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ

20-03-2026 12:24 AM

తాడ్వాయి, మార్చి, 19( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుస్తులు పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందించిన దుస్తులను నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సముచితంగా చూస్తుందని తెలిపారు.

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేసి అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. మండలంలోని కృష్ణాజివాడి, ఎర్ర పహాడ్, దేమి కలాన్,కరడ్ పల్లి, చందాపూర్, బ్రాహ్మణపల్లి, చిట్యాల, సంతాయిపేట గ్రామాలలో దుస్తులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు ఆకిటి వెంకట్ రామ్ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు, జంగం రాజు, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు