ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
25-05-2026 01:14 PM
బోథ్, మే 25 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన మేడిపల్లి లక్ష్మి కి ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కావడంతో ఆమెకు సోమవారం మాజీ సర్పంచ్ సురేందర్ ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు. స్థానిక శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈ చెక్కును అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు యూత్ అధ్యక్షులు మేడిచెల్మ ప్రవీణులు ఉన్నారు






