మహంకాళి ఆలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు
18-07-2026 08:41 PM
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆషాఢ మాసం బోనాల పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆహ్వానం మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసీ) అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల విశిష్టతను సీనియర్ నాయకుడు మల్లుగారి నర్సాగౌడ్ డిసిసీ అధ్యక్షుడికి వివరించారు.






