calender_icon.png 16 March, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ఫుడ్‌తో మెదడుకు చేటు

16-03-2025 12:03:54 AM

బర్గర్స్, కూల్ డ్రింక్స్, చిప్స్, కుకీస్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్ అతిగా తీసుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. వీటితో మతిమరుపు, ఆలోచన సామర్థ్యం తగ్గటం, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. ఈ సమస్యలకు ప్రాసెస్డ్ ఫుడ్ కారణమవుతున్నట్టు రుజువు కాలేదు. కాని, వీటి మధ్య సంబంధం ఉంటున్నట్టు మాత్రం వెల్లడైంది. మెదడు ఆరోగ్యంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ముఖ్యమైన ఆహార మార్పులేంటనేది కచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు పైబడ్డవారిలో మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. కూల్ డ్రింక్స్, చిప్స్ వంటివి తక్కువగా తిన్నవారితో పోలిస్తే వీటిని ఎక్కువగా తిన్నవారికి మెదడు సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. ప్రాసెస్డ్ ఫుడ్‌తో చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా.. ప్రొటీన్, పీచు తక్కువగా ఉంటాయి. ఇవి రకరకాల మార్గాల్లో మెదడుకు చేటు చేస్తుండొచ్చని భావిస్తున్నారు