సుల్తానాబాద్లో కౌన్సిలర్లకు ఘన సన్మానం
సుల్తానాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 6, 7 ,9 వార్డు కౌన్సిలర్లు బాకం సాయి కిరణ్, ఉట్ల వరప్రదీప్, తొర్రికొండ ప్రభాకర్ లను బస్తి దావకాన డాక్టర్ సింధు జ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సమత, అంగన్వాడి టీచర్ అరుణ ల ఆధ్వర్యంలో యాదవ నగర్ లో బుధవారం శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డు పరిధిలలో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు వర ప్రదీ ప్ తదితరులు మాట్లాడుతూ దశలవారీగా సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నా రు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సరస్వతి ,ఆశలు రమా, స్వప్న తోపాటు యాదవ న గర్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




