calender_icon.png 19 February, 2026 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలపై కౌన్సిలర్ స్వప్న రాణి క్షేత్రస్థాయి పరిశీలన

19-02-2026 05:43:57 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయ క్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని5వ వార్డులో  సమస్యలను తెలుసుకునేందుకు కౌన్సిలర్ స్వప్న రాణి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటన్నింటినీ నమోదు చేసుకున్నారు.వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని  స్వప్న రాణి తెలిపారు. నమోదు చేసిన సమస్యలన్నింటినీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి కృష్ణ ,అసద్, తాజ్ తదితరులున్నారు.