బెల్లంపల్లిలో కౌన్సిలర్ ఔదార్యం
09-03-2026 03:25 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీ 3వ వార్డు (అంబేద్కర్ నగర్)లో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సహాయం అందించి కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ ఔదార్యం చాటుకున్నారు. 3వ వార్డు అంబేద్కర్ నగర్కు చెందిన ఎటకారి పద్మ మరణించిన నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని 3వ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ అక్కడికి పరామర్శించారు. పద్మ మృతదేహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాన్ని ఓదార్చి సంతాపాన్ని ప్రకటించారు. తనకు తోచిన ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.




