2 July, 2026 | 3:55 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

సిసి మార్కెట్లను తెరవాలని పత్తి రైతుల డిమాండ్

08-10-2025 08:24 PM

చిట్యాల (విజయక్రాంతి): పత్తి రైతుల కష్టాలను తెలుసుకొని తక్షణమే సిసి మార్కెట్లను తెరవాలని చిట్యాల మండల పత్తి రైతులు బుధవారం అధికారులను డిమాండ్ చేశారు. పత్తి పంటపై చీడపురుగుల ప్రభావం తీవ్రంగా ఉండడం వలన పంట పూర్తిగా దెబ్బతిని రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎరువులకు, క్రిమిసంహారకాలకు, పంట సాగుకు అధిక మొత్తంలో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నష్టపోయామన్నారు. మరోవైపు అకాల వర్షాల వలన పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, చేనులోని పత్తి తడిసి పూర్తిగా రైతులకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో రైతులు పత్తి పంటను సాగు చేయడం వలన కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే రైతులకు పత్తి అమ్ముకోవడానికి తక్షణమే సిసి మార్కెట్ తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని రైతుల పక్షాన కన్నెబోయిన మహాలింగం తెలిపారు.