29 April, 2026 | 5:43 PM

జరుగకుండా చర్యలు తీసుకోవాలి

29-04-2026 04:37 PM

మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీరు.  అవినీతి కార్యక్రమాలకు నిర్వాహకులు. సంబంధిత అధికారులు పాల్పడుతున్నారని మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కేంద్రంలో తూకాల్లో మోసం. మరొక కేంద్రంలో వేరే రైతుల వద్ద ధాన్యం తక్కువ రేట్లకు మార్కెట్లలో కొనుగోలు చేసి , లారీలు ట్రాక్టర్లలో ఐకెపి లో మద్దతు ధరకు అమ్మడం. మిల్లర్ తో కుమ్మక్కై తుకాల్లో కటింగ్ చేయించడం.

లారి లోడింగ్ చేస్తున్న సందర్భంగా లారీలో వేసిన ధాన్యం బస్తాలను ఎక్కువగా ట్రక్ షీట్ లో నమోదు చేసిరైతులను మోసం చేస్తున్నారని. ఇట్టి మోసాలల్లో మండల స్థాయి నుండి మొదలు కొని జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములేనన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని. రైతాంగాన్ని కాపాడాలని కోరుతున్నాము.ఈ సమావేశం లో మండల నాయకులు గోపగాని రమేష్. ఉప్పల నాగమల్లు.. నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు