4 April, 2026 | 2:01 PM

Breaking News

క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •  

ఘనంగా సుందరేశ్వరుల దుర్గాభవానీల పట్టాభిషేకం

03-10-2025 10:20 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్‌ రూరల్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీ దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న దుర్గాభవానీ శరన్నవరాత్రుల చివరి రోజైన శుక్రవారం దుర్గాభవానీ అమ్మవారు అర్ధనారేశ్వర అలంకరణలో నంది, సింహ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. సుందరేశ్వరుల, దుర్గాభవానీల పట్టాభిషేకం, రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్‌ కుమార్, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావులు ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటి బాధ్యులు ఈ సందర్భంగా వారిని అమ్మవారి శేషవస్త్రాలతో సన్మానించి అమ్మవారి ప్రసాదం అందజేసారు.  భక్తులు అమ్మవారిని దర్శించుకుని చీరేసారే పెట్టి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు సౌందర్యలహరి పారాయణం చేశారు.