15 May, 2026 | 4:41 PM

అటవీ భూమిలో పశువుల పాకల నిర్మాణం.. గ్రామస్తుల వివాదం

15-05-2026 03:28 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని పుణ్య నాయక్ తండ పార్టీ (బి )గ్రామానికి చెందిన. కొంతమంది అటవీ భూమిలో నివాసాలను ఏర్పరచుకొని ఇటీవల పశువుల పాకల నిర్మాణం చేపడుతున్నారు. అయితే పశువుల పాకలను నిర్మించిన చోట చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో గ్రామానికి చెందిన కొంతమంది అభ్యంతరం తెలుపు ఉన్నారు. ఫెన్సింగ్ వేయటం వల్ల తన పశువులు బయటకు వెళ్లకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు. ఈ విషయం అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకుగాను అటవీ శాఖ అధికారులు తమ చర్యలు చేపట్టాల్సిన ఉందని పలువురు అంటున్నారు. సమస్య తీవ్రతరం కాకముందే అధికారులు స్పందించాల్సి ఉంది