మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ నవీన్
09-04-2026 11:37 AM
జగదేవపూర్,(విజయక్రాంతి): అత్యవసర సమయంలో అండగా నీలిచినా కానిస్టేబుల్. వివరాల్లోకి వెలితే మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ళ రాజు కి ఎమ్మెల్సి యాదవ రెడ్డి గన్ మ్యాన్ కానిస్టేబుల్ నవీన్ ఏ-పాజిటివ్ రక్త దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ రక్త దానం చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడడం సంతోషంగా ఉంది అన్నారు.గతం లో కూడా చాలా సార్లు రక్తం దానం చేసినట్లు పేర్కొన్నారు. రక్తం దానం చేసిన నవీన్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




