15 July, 2026 | 1:38 PM

Breaking News

ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •  

ఉపాధి హామీ ఎత్తివేయడానికే కుట్ర

20-12-2025 01:15 AM

బూర్గంపాడు,డిసెంబర్19(విజయక్రాంతి):పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చ ట్టాన్ని ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు.

శుక్రవారం బూర్గంపాడు మండలం పాండవుల బస్తీలో ఉపాధి కార్మికులతో జి-రామ్-జీ పత్రాన్ని తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజివిక మిషన్ పేరుతో బిల్లును తీసుకు వస్తు న్నారన్నారు.

పథకాన్ని నీరుగార్చే ఉద్దేశంలో భాగంగానే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. 2014నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమంగా ఈ ప థకాన్ని నీరుగారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బోయిన ఆదెమ్మ, బర్ల మాణిక్యం,గుమ్మడి గోవిందమ్మ, పుట్టి నాంచారమ్మ,పుట్టి చిట్టెమ్మ,నాని,లక్ష్మి, బర్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.