1 July, 2026 | 8:55 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

28-04-2026 01:30 AM

మేడ్చల్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ మను చౌదరి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు, మెడిసిన్ స్టోరేజ్ ఏరియాను తనిఖీ చేసిన కలెక్టర్, అక్కడ ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు.

ముఖ్యంగా ట్యాబ్లెట్ల ఎక్స్పైరీ డేట్లను (గడువు ముగిసే తేదీలను) స్వయంగా తనిఖీ చేసి, నాణ్యమైన మందులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు  సిబ్బందికి ఉపయోగపడే విధం గా అదనపు వాష్రూమ్ సౌకర్యం కల్పించాలని సిబ్బంది కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రతిపాదనలు పంపాలని, త్వరలోనే వాష్రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ అనూష, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.