తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సహకరించండి: రేవంత్ రెడ్డి
తుమ్మిడిహెట్టిపై కేంద్రం జోక్యం కోరిన రేవంత్ రెడ్డి
మహారాష్ట్రను ఒప్పించాలని వినతి
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో( Revanth Reddy Delhi Tour) బిజీగా ఉన్నారు. రాష్ట్ర సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై వరసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో(Jal Shakti Minister CR Patil) రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో సీఎం భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు(Tummidihatti Project) ఎత్తు పెంపునకు మహారాష్ట్రతో చర్చలకు జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. 148 మీటర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని కేంద్ర మంత్రి పాటిల్కు గుర్తు చేశారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. 150 మీటర్లకు పెంచినా ముంపు 1000 హెక్టార్ల లోపు ఉంటుందని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్కు తెలిపారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి రేవంత్ సూచించారు.






