11 May, 2026 | 4:55 PM

ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదు: సీఎం రేవంత్ రెడ్డి

11-05-2026 03:49 PM

మోదీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ 

కేంద్రంతో కలిసి నడుస్తాం

ప్రధాని మోదీ పిలుపులో రాజకీయాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక కార్యక్రమంలో నిన్న పాల్గొన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం నాడు నిర్వహించిన మీడియాతో చిట్ చాట్ లో పేర్కొన్నారు. తమతో కలిసి రావాలన్న  ప్రధాని పిలుపును స్వాగతిస్తున్నట్లు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి వివరించారు.

తెలంగాణ రాజకీయాలపై మరిన్ని వార్తలు చదవండి

వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి నడుస్తామని వెల్లడించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. మా పార్టీలు, ఐడీయాలజీ వేరైనా.. అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఎన్నోసార్లు కలిసినా.. కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. రెండు గంటలు సమయమిస్తే తమ ప్రణాళికను ప్రధానికి వివరిస్తామని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాలకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరానని చెప్పారు.

విదేశీ విధానంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఆరోపించారు. అసమర్థతను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. జెమినీ సర్కస్ లా బీజేపీ ఎన్నికల విధానం ఉంటుందన్నారు. గాలిని తిని, గాల్లో బతకమని మోదీ చెప్పారని వివరించారు. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదన్నారు. ఎస్ఐఆర్ ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటోందని వెల్లడించారు. బెంగాల్ లో90 లక్షల ఓటర్లను తొలగించారని తెలిపారు.2029లో జమిలీ ఎన్నికలు పెట్టే అవకాశముందన్నారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చెప్పారు. ప్రధాని మాటాలు దురదృష్టకరమన్న రేవంత్ రెడ్డి మావోయిస్టుల లొంగుబాటుపై తాము చొరవ తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ వార్తల కోసం ఇక్కడ విజయక్రాంతి న్యూస్‌ను క్లిక్ చేయండి

మనుషులను చంపడం పరిష్కారం కాదన్న ముఖ్యమంత్రి మనుషుల ప్రాణాల విలువ తమకు తెలుసని వివరించారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు ఏ సమస్యలపై కొట్లాడారో వాటిపై తాము చట్టాలు చేశామన్నారు. సమస్యలు తగ్గడం వల్లే మావోయిస్టులు తగ్గిపోయారని చెప్పారు. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని తాము చెప్పామన్నారు. చివరకు మావోయిస్టులు తమ దారికి వచ్చారని వెల్లడించారు. మావోయిస్టులు, ముస్లింలు ఈ దేశంలో భాగస్వాములన్నారు. ముస్లింలను వేరే చేసిచూపించడం మంచిది కాదన్నారు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ.. విడగొట్టాలని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఇదే బీజేపీ విధానం.. బీజేపీ వివక్ష అని రేవంత్ మండిపడ్డారు.