13 May, 2026 | 5:25 PM

Breaking News

రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు   •   చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •  

ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువగా..

05-05-2025 01:51 AM
  1. లక్నోపై విజయకేతనం ఎగురేసిన పంజాబ్
  2. ఉత్కంఠ పోరులో విజయం సాధించిన కేకేఆర్

న్యూఢిల్లీ, మే 4: డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ విజయబావుటా ఎగరేశాయి. ఆదివారం మధ్యాహ్నం పోరులో రాజస్థాన్‌పై కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అనంతరం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై 37 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది.

టాస్ గెలిచిన లక్నో పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు 236 పరుగుల భారీ స్కోరు సాధించారు. 237 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది.

ఆయుష్ బదోని (74), అబ్దుల్ సమ ద్ (45) పోరాటంతో లక్నో ఆ మా త్రం స్కోరైనా చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువయింది. నేడు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.