డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా కార్యక్రమం
06-03-2026 06:43 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు తొలిదశలో పది రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతీ రోజు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కార్యాచరణలో భాగంగా కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడంతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.డి.లక్ష్మినరసింహం అకడమిక్ కో ఆర్డినేటర్ డి.జనార్థన్, ఐక్యుఎసి కో ఆర్డినేటర్ డా.ఇ.శారద అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.




