ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు
06-06-2026 08:52 PM
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయ కాలక్షేప మంటపంలో శని వారం చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. మంచిర్యాలలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రాంగణంలో శ్రీనిధి నృత్య కళానిలయం నాట్యాచారిని కాపూడి వసుధ 30 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పత్రాలను అందజేశారు. దశావతారం, జతిస్వరం, రామాయణ శబ్దం తదితరాలపై చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.






