బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం
06-06-2026 08:50 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో సింధు పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ శిబిరంలో బైరగోని నందు గౌడ్, సింధు పిల్లల హాస్పిటల్ వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శిబిరానికి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించింది.






