30 August, 2026 | 6:20 PM

అగ్నిప్రమాదంలో పశువులపాక దగ్ధం నాలుగు లక్షల నష్టం

30-08-2026 05:21 PM

బోథ్ ఆగస్ట్ 30 ( విజయ క్రాంతి): సోనాల మండలంలోని పూలు సింగ్ నాయక్ తండ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పూట ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పశువులపాక పూర్తిగా దగ్ధమైంది. సంఘటనలో రైతుకు చెందిన పశువుల పాక తో పాటు విద్యుత్ మోటార్ ఎరువులు పశుగ్రాసం కాళీ బూడిద అయింది. దీంతో రైతుకు నాలుగు లక్షల రూపాయల మేరకు నష్టం సంబంధించింది. అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కురవడంతో మంటలు ఆరిపోయాయని స్థానికులు పేర్కొన్నారు