పాత్రికేయుల ఇండ్ల స్థలాలకు
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మద్దతు
కొత్తగూడెం ఆగస్టు 30 విజయ క్రాంతి: ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసమే పనిచేసే ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ పాలకవర్గాలు, కేంద్ర ప్రభుత్వం ఏమో అటవీ సంపదని కార్పోరేట్ కంపెనీలకు ధారాధత్వం చేసే దాంట్లో భాగంగా ఒక ఎకరాకు ఒక రూపాయి చొప్పున ఇచ్చినటువంటి కేంద్ర బిజెపి ప్రభుత్వం.ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫీసుల పేరుతో గజం 100 రూపాయల చొప్పున ధారాధత్వం చేస్తా ఉంది.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు,చేసే అటువంటి న్యాయమైన డిమాండు వీరికి కనపడదా అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఫ్రెంట్ అండ్ మీడియా మిత్రులు చేసేటువంటి న్యాయమైన డిమాండ్ ని పరిష్కరించాలని,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నా ప్రింట్ మీడియామిత్రులు తీసుకునేటువంటి ఏ కార్యక్రమం అయినా,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కామ్రేడ్ పెద్ద చంద్రన్న పార్టీ) మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదారపు ఉమాశంకర్, సప్పిడి వెంకటేశ్వర్లు,గోపి,రాము తదితరులు పాల్గొన్నారు.






