21 August, 2026 | 4:34 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదు

21-08-2026 01:14 PM

నాగర్‌ కర్నూల్‌,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో(Former MLA Marri Janardhan Reddy) పాటు మరో 38 మంది మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించడంతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంతో ఈ కేసు నమోదైంది. నాగర్‌ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట  బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎలాంటి అనుమతి లేకుండానే ఆర్డీఓ కార్యాలయం వైపు చొచ్చుకెళ్లే క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. కానిస్టేబుల్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగర్‌ కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.