13 May, 2026 | 12:44 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన బీఆర్‌ఎస్

11-10-2025 01:46 AM

హామీల పేరుతో మోసం : మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి

మెదక్, అక్టోబర్ 10(విజయక్రాంతి):కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ రూపొందించిన బాకీ కార్డును ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షురా లు, మాజీ ఎమ్మెల్యే ఎం.పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో విడుదల చేశారు.

ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు గారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హౌస్ అరెస్టులు చేస్తే బిఆర్‌ఎస్ పార్టీ భయపడేది కాదనీ , ఎన్ని అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా తమ పోరాటం ఆపమన్నారు.

కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తుచేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు.

కాగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులోనీ వివరాలను వివరించాలని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హన్మంతరెడ్డి, లావణ్య రెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.