షకీల్ నివాసంలో బీఆర్ఎస్ సమావేశం.. ఎంఐఎంపై విమర్శలు
04-07-2026 05:38 PM
బోధన్,(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అధ్యక్షులు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ..మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబం గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని ఎంఐఎం నాయకులను హెచ్చరించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా పోటీ పడాలి కాని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుమ్ముల అశోక్ రెడ్డి, ముబిన్, అజర్ నాయకులు పాల్గొన్నారు.






