28 March, 2026 | 4:56 AM

భళారే బండ్ల ప్రదర్శన

28-03-2026 01:09 AM

పాపన్నపేట,మార్చి27: మండల కేంద్రం పాపన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై శ్రీరామనవమిని పురస్కరించుకొని ఎడ్లబండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమికి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉదయం సీతారాముల  కళ్యాణం అనంతరం సాయంత్రం గుట్టపై ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తారు. గ్రామ ప్రజలే కాకుండా మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు జాతరకు భారీ ఎత్తున తరలివస్తారు. శ్రీరామనవమి మొదటి రోజైన శుక్రవారం ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించి శనివారం బోనాలు, ఆదివారం రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.