22 April, 2026 | 11:11 PM

మొగ్దుంప‌ల్లిలో బోరు వేయించిన నాయ‌కులు

21-11-2025 11:31 AM

మునిప‌ల్లి: మండ‌లంలోని మొగ్దుంప‌ల్లి గ్రామంలో తాగునీటి అవ‌స‌రాల కోసం రాష్ట్ర వైద్య‌ ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజ‌న‌ర్సింహ్మ స‌హ‌కారంతో బోరు మంజూరైంది. ఈ సంద‌ర్భంగా గురువారం నాడు  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు ర‌సూల్ ప‌టేల్  బోరు మోట‌రు వేయించి మాట్లాడారు.  మంత్రి దామోద‌ర స‌హ‌కారంతో మండ‌లంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందుల్లేకుండా చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు  మర్పల్లి సంగన్న, కార్యదర్శి నర్సింలు, షఫీయొద్దిన్ , చాంద్ పాషా, ఎంపల్లి నాగిశెట్టి, చెల్మెడ వీరన్న , బాయికాడి ఈశ్వరప్ప, ప్రమోద్, గ్రామస్థులు పాల్గొన్నారు.