7 August, 2026 | 5:00 PM

Breaking News

సిద్దిపేట టిఐసిసిఐ కో-ఆర్డినేటర్‌గా బిక్షపతి   •   గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •  

షైన్ పాఠశాలలో బోనాల పండుగ

07-08-2026 03:41 PM

తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత : షైన్ పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్ 

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని షైన్ పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక షైన్ 2.0 పాఠశాలలో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు, పోతరాజు, బోనం తదితర వేషధారణతో నిర్వహించిన బోనాల ఊరేగింపు, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

దీంతో పాఠశాల ఆవరణం అంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ బోనాల పండుగ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మన సంస్కృతిపై గౌరవాన్ని, సంప్రదాయాల పట్ల అవగాహనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి, ఇంచార్జి రాజేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.