సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అప్పయ్య పల్లి సర్పంచ్ రమేష్
గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
గణపురం,(విజయ క్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అప్పయ్య పల్లి సర్పంచ్ ఎలకపల్లి రమేష్ అన్నారు. మండలం అప్పయ్యపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని వైద్యురాలు నిహారిక ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుకపెళ్లి రమేష్ మాట్లాడుతూ, వర్షాకాలం కారణంగా గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ శిబిరం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల , అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులు, గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తపోటు పరీక్షలు చేశారు. పిల్లలకు ఆరోగ్యంపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాకేష్ రెడ్డి, శేఖర్, ఆరోగ్య కార్యకర్త వినోద, ఆశా కార్యకర్తలు స్వప్న, పద్మ, అంగన్వాడి ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






