9 May, 2026 | 4:47 PM

Breaking News

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •   దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు   •   టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ   •   కొత్తగూడెంలో ఘనంగా కంట మహేశ్వరుని కళ్యాణ మహోత్సవం   •   పల్లకి సేవలో వట్టెం వెంకన్న   •   భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి   •   మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా   •   మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..   •   స్వాములకు ఉచితంగా అన్న ప్రసాదం   •  

అన్నోజిగూడలో నేటి నుంచి మూడు రోజులపాటు బీకేఎస్ సమావేశాలు

27-02-2026 12:24 AM

అఖిలభారత అధ్యక్షుడు కండెల సాయి రెడ్డి

ఘట్ కేసర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): రైతాంగ సమస్యల పరిష్కారం, లాభసాటి ధర సాధనకై భారతీయ కిసాన్ సంఘ్ నిరంతరం కృషి చేస్తుందని అఖిల భారత అధ్యక్షులు కండెల సాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత సమావేశాలు ఈనెల 27 నుండి మార్చి 1 వరకు మూడు రోజులపాటు పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడరాష్ట్రీయ విద్యా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

భారతీయ కిసాన్ సంఘ్ యొక్క అఖిల భారత అధ్యక్షులు కె. సాయి రెడ్డి భారతమాత పూజ భగవాన్ బలరాం దీపప్రజ్వలన, ధ్వజారోహణ చేశారు. ఈసమావేశంలో దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ విధానాలు, ధరల హామీ, సాగు ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ బలోపేతం, స్వదేశీ వ్యవసాయ విధానాల ప్రోత్సాహానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు.