3 April, 2026 | 4:50 PM

TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్

03-04-2026 02:58 PM

న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల(Tamil Nadu Assembly Election) కోసం భారతీయ జనతా పార్టీ శుక్రవారం 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్‌ను(Union minister L Murugan) అవినాశి స్థానం నుండి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై(Tamilisai Soundararajan) సౌందరరాజన్‌ను మైలాపూర్ స్థానం నుండి బరిలోకి దింపింది. 

పార్టీ విడుదల చేసిన జాబితా ప్రకారం, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు(BJP Mahila Morcha National President) వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు (ఉత్తర) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  మొదకురిచ్చి నుంచి కీర్తికా శివకుమార్‌, విలవంకోడ్‌ నుంచి ఎస్‌ విజయధరణి, తల్లి స్థానం నుంచి నగేష్‌కుమార్‌లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఆసక్తికరంగా, మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై పేరు ఈ జాబితాలో వెల్లడించలేదు. 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు శాసనసభకు పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. బీజేపీ, ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, తమిళనాడు శాసనసభకు జరగనున్న సాధారణ ఎన్నికల కోసం కింది పేర్లను ఖరారు చేసింది.