బండారు దత్తాత్రేయ కలిసిన భూమయ్య
22-08-2026 04:06 PM
నిర్మల్,ఆగస్టు 22 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను శనివారం నిర్మల్ జిల్లా బిజెపి పార్టీ పార్లమెంటు ఇంచార్జ్ అయ్యన్న గారి భూమయ్య కలిశారు. హైదరాబాదులోని బండారు దత్తాత్రేయ నివాస భవనంలో ఆయనను కలిసినట్టు తెలిపారు. బండారు దత్తాత్రేయకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను దత్తాత్రేయ అడిగారని బిజెపి నేత భూమయ్య తెలిపారు.






