9 May, 2026 | 10:22 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలి

29-11-2025 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): భూ భారతి, రెవెన్యు  సదస్సుల పెండింగ్ దరఖాస్తులు, విద్యార్ధులకు అందించే సర్టిఫికెట్స్‌లపై శుక్రవారం సాయంత్రం ఆర్డీఓ, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన పెండింగ్ దరఖాస్తుల పై మండలాల వారీగా రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సమీక్ష సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత మాడ్యూల్ లో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ ,  నోటీసులు జారీచేసిన వివరాలు అలాగే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అన్ని వివరాలను ఆన్లైన్లో సమగ్రంగా అప్లోడ్ చేసిన వాటిపై ఆరా తీశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకునుగుణంగా సాదాబైనామా దరఖాస్తులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

తిరస్కరణకు గురైన దరఖాస్తుల విషయంలో స్పష్టమైన, వివరణాత్మక కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులు అందిన వెంటనే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వెంటనే మంజూరీ జాబితాలను పంపాలని నిర్దేశించారు. ఆధార్ కోసం అవసరమైన విద్యార్థులకు జనన ధృవీకరణ పత్రాలను అత్యంత త్వరితగతిన జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.