8 June, 2026 | 7:19 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

అనిల్‌కు ‘ఉత్తమ కవిత అవార్డు’

08-06-2026 01:24 AM

మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రాజమండ్రిలో నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన యువకవి వరిపల్లి అనిల్ కుమార్ అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటి ’ఉత్తమ కవిత అవార్డు’ కైవసం చేసుకున్నారు.

ప్రపంచంలోని వివిధ దేశాల నుంచే కాకుండా, భారతదేశం నలుమూలల నుండి ప్రముఖ కవులు, రచయితలు, పరిశోధకులు, సాహితీవేత్తలు హాజరైన ఈ మహాసభల్లో అనిల్ కుమార్ రాసిన కవితకు ఈ విశిష్ట పురస్కారం లభించింది. శనివారం జరిగిన ఘనమైన సభలో దేశ విదేశాల సాహితీ దిగ్గజాల సమక్షంలో ఆయనకు ఈ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు.