బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి
* గిరిజన సంఘం నాయకులు హర్షం
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలం కీతవారి గూడెం గ్రామానికి చెందిన గరిడేపల్లి ప్రెస్ క్లబ్ చైర్మన్, బీసీ నాయకులు కొండ సైదులు గౌడ్ కుమారుడు బీసీ ముద్దుబిడ్డ దీపక్ కుమార్ గౌడ్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థ ప్లేండర్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కోర్సులో గ్రాడ్యుయేషన్ విజయవంతం చేసిన సందర్భంగా శుక్రవారం గిరిజన సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేయడం గర్వకారణమని, దీపక్ కుమార్ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గిరిజన నాయకులు తెలిపారు. కృషి, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగులోతు నీలా హేమ్లా నాయక్ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు కూడా ప్రపంచస్థాయిలో రాణించగలరని దీపక్ కుమార్ నిరూపించాడని అన్నారు.






