6 March, 2026 | 11:46 PM

రాష్ట్రస్థాయి పోటీలకు బెల్లంపల్లి సిఓఈ విద్యార్థులు

06-03-2026 04:08 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీ) పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 14 సాఫ్ట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు. ఎస్జీఎఫ్ జోనల్ లెవెల్ పోటీలు బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో డిసెంబర్ 9 నిర్వహించినట్లు తెలిపారు.

ఈ పోటీలలో మంచిర్యాల జిల్లా తరఫున ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. మహబూబాద్ పట్టణంలోని సాక్రీడ్ హాట్ హై స్కూల్ నీలికొండలో ఈనెల7 తారీఖు నుంచి 9 వ తారీకు వరకు రాష్ట్రస్థాయి అండర్ 14 సాఫ్ట్బాల్ పోటీలు విద్యార్థులు పాల్గొంటారనీ  తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు డి.విశ్వతేజ, పి. రిసేంద్ర వర్మ, జి సుశాంత్, ఏ . శ్రీ హర్షవర్ధన్, ఎస్, సంకిత్ సాయి, డి. చైతన్య ఎస్. విజయ్ చంద్ర, ఎంపికయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ విజయ సాగర్, వైసీ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, సీనియర్ అధ్యాపకులు దశరథం, కొండలరావు అభినందించారు. మంచిర్యాల డీసీఓ రమా కళ్యాణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులకు పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్ పాల్గొన్నారు.