calender_icon.png 18 February, 2026 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

17-02-2026 12:39:09 AM

నాగోల్ సీఐ జానీ

ఎల్బీనగర్, ఫిబ్రవరి 16: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలిగినప్పుడే ఆర్థిక మోసాలకు గురికాకుండా తమ కష్టార్జిత ధనా న్ని కాపాడుకోగలుగుతారని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ స్పష్టం చేశారు. సోమవారం నాగోలు పరిధిలోని బం డ్లగూడలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై బుర్ర కథ కళాకారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మక్బూల్ జానీ మాట్లాడుతూ... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ మోసాల పద్ధతులు కూడా విస్తరిస్తున్నాయని సోషల్ మీడియా మోసాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాంకు అధికారులు  ఖాతాదారులకు ఆర్థిక సాక్షరతపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రాజలక్ష్మి, సిబ్బంది మమత, శశిధర్ , ఫణి కుమార్, ఖాతాదారులు పాల్గొన్నారు.