13-02-2026 05:53:14 PM
గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ నాయక్
మోతె, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): ఈ నెల 15 న బంజారా ఆత్మ గౌరవ ప్రతీక సద్గురు సేవాలాల్ మహా రాజ్ జయంతి వేడుకలు ప్రతి గ్రామంలో ప్రతి తాండల లో ఘనంగా నిర్వహించాలని గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి గుగులోతు లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటన తెలిపారు. సేవా లాల్ మహా రాజ్ సందేశం ప్రతి గిరిజన బిడ్డలు ఆచరించాలని జాతి ఆచారాలు బంజారా కుటుంబాలు గౌరవించుకోవాలని ప్రతి ఇంటి ముందు బోగ్ బండారుతో ఆచరించాలని తెలిపారు.