13 April, 2026 | 6:10 PM

ప్రభుత్వ విత్తనాల వినియోగంపై అవగాహన

13-04-2026 04:42 PM

 రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామంలో రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సమక్షంలో రైతులతో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతులు ప్రైవేట్ విత్తనాల కంటే ప్రభుత్వ విత్తనాలను వినియోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించబడింది. ఈ సందర్భంగా రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ విత్తనాలు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయబడినవని, ఎక్కువ దిగుబడిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

అలాగే ప్రభుత్వ విత్తనాల ద్వారా రైతులకు విశ్వసనీయతతో కూడిన పంట దిగుబడి లభిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా రైతులకు సరైన విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, పంట ఉత్పత్తి పెంపు గురించి మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. ప్రైవేట్ విత్తనాలపై ఆధారపడకుండా, ప్రభుత్వ విత్తనాలను వినియోగించడం ద్వారా ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.