6 May, 2026 | 7:08 PM

రైతులకు సబ్సిడీ పంట రుణాలపై అవగాహన

06-05-2026 06:15 PM

- మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి

కొండపాక: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విరుపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్, కో-ఆపరేటివ్ బ్యాంక్ సంస్థలతో రైతులకు సంబంధించి సబ్సిడీ లోన్స్, మార్ట్ గెజీ లోన్స్, క్రాప్ లోన్స్ పై అవగాహన కల్పించారు. రైతులు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.