21 April, 2026 | 8:57 PM

ఖమ్మం జిల్లా ఎమ్మార్టీ డీఈగా అంజయ్య

01-10-2025 12:01 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ ఎమ్మార్టీ డివిజనల్ ఇంజనీర్‌గా సిరిపురం అంజయ్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్‌స్ట్రక్షన్ డీఈగా పనిచేసిన అంజయ్య.. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మార్టీ డివిజనల్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భం గా జిల్లా స్థాయి కార్యాలయ సిబ్బంది డిఈ హీరాలాల్,  ఏడీఈలు ఆనంద్, ఖాదర్ బాబు, బాలాజీ, నాగార్జున, యూనియన్ నాయకులు శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.