ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ
01-07-2026 06:41 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీవీపీ నాయకులు బోయిడి ఆకాష్ పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు లేనిపోని వరుసలు ప్రవేశపెట్టి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు యూనిఫాం పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారన్నారు. అధికారులు పుస్తక దోపిడీపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఐటి ఫౌండేషన్ పేరుతో మూడవ తరగతి నుండి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని మండల విద్యాధికారి కార్యాలయంలో అందించారు






