అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు పదో తరగతి సెకండ్ బోర్డు ఎగ్జామ్స్లో అత్యుత్తమ ఫలితాలు
20-07-2026 12:05 AM
కొత్తపల్లి, జూలై 19 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు సెకండ్ బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీబీఎస్ఈ సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాల్లో పాఠశాల చెందిన కె.ఓం కార్తికేయ 500 మార్కులకు గాను 495 మార్కులతో జిల్లా స్థాయిలో ప్ర థమ స్థానంలో నిలిచాడని, ఎం శ్రీహిత 494 మార్కులు, ఏ స్వర విస్తృతి 492 మా ర్కులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పుష్పగుచాలను అందజేసి అ భినందించారు. భవిష్యత్తులో మరిన్ని అపూ ర్వ విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, బోధనా, బోధ నేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






