మైసా కోసం సాహసాలు!
స్టార్ బ్యూటీ రష్మిక మందన్న మరోసారి నటన పట్ల తనకున్న అంకితభావాన్ని నిరూపించుకున్నారు. ‘మైసా’ సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తోందీ నేషనల్ క్రష్. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ను ఇటీవల కేరళలోని ప్రసిద్ధ అతిరపల్లి జలపాతం వద్ద చిత్రీకరించారు. ఈ సందర్భంగా రష్మిక సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ సహాయం లేకుండా కిందకు దూకారు.
ఈ సమయంలో ఆమె కాళ్లు, చేతులకు గాయాలై, రక్తం వస్తున్నప్పటికీ, ఆమె వెనకడుగు వేయకుండా, ప్రాథమిక చికిత్స తీసుకున్న వెంటనే తిరిగి షూటింగ్లో పాల్గొనడం చిత్ర యూనిట్ను విస్మయానికి గురిచేసింది. ప్రముఖ అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో బ్యాంకాక్లో వారం పాటు ప్రత్యేక శిక్షణ పొందిన రష్మిక మార్షల్ ఆర్ట్స్, గిరిజన పోరాట పద్ధతులను నేర్చుకున్నారు. ఈ చిత్రంలో రష్మిక గోండ్ తెగకు చెందిన ఒక శక్తిమంతమైన మహిళగా కనిపించను న్నారు. 1940ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్ర పేరు ‘మైసా’.






