దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
19-05-2026 07:15 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని సాగర గ్రామానికి చెందిన జాదవ్ దేవి కా బాయ్ అనే మహిళ ఇంట్లో నుండి ఈనెల 13న 70 వేల రూపాయలు దొంగతనం జరిగినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ పురుషోత్తం సాంకేతిక ఆధారాలు సేకరించి హనుమాన్ నిధుల పైన దృష్టి సారించారు. అయితే దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కదలికను పరిశీలించి గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనానికి పాల్పడ్డట్టు ఒప్పు కోవడం జరిగిందని సీఐ గురుస్వామి తెలిపారు. దీంతో నిందితుని వద్ద నుండి 70 వేల రూపాయల నగదును రికవరీ చేయడం జరిగిందన్నారు. అనంతరం రిమాండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.






